IND-AUS ఫైనల్ మ్యాచ్ ను ఎన్ని కోట్లమంది చూశారంటే !

-

నిన్న అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జరిగిన మ్యాచ్ లో చివరికి ఊహించని ఫలితం రావడంతో కోట్లాదిమంది అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ మ్యాచ్ లో ఇండియా 6 వికెట్ల తేడాతో ఓడిపోయి చాలా పరువును పోగొట్టుకుంది. కీలక మ్యాచ్ లో గిల్, అయ్యర్, సూర్య, జడేజా, సిరాజ్, కుల్దీప్, షమీలు రాణించకపోవడం వలనే మ్యాచ్ ఓడిపోయింది. కాగా ఈ మ్యాచ్ ను హాట్ స్టార్ ఓటిటి లో లైవ్ టెలికాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ను ఫ్యాన్స్ హాట్ స్టార్ లో 5 .9 కోట్ల మంది వీక్షించారు. ఇది ఈ వరల్డ్ కప్ లోనే హైయెస్ట్ వ్యూయర్ షిప్ గా రికార్డు నమోదు చేసింది. ఇక ఈ వరల్డ్ కప్ లోనే సెమి ఫైనల్ లో ఇండియా మరియు న్యూజిలాండ్ లు తలపడిన మ్యాచ్ ను 5.2 కోట్ల మంది చూడడం విశేషం.

లీగ్ దశలో జరిగిన ఇండియా మరియు పాకిస్తాన్ మ్యాచ్ ను 3 .5 కోట్ల మంది చూశారు. కానీ అన్నిటికంటే ఫైనల్ మ్యాచ్ కు అధికంగా వ్యూయర్ షిప్ రావడంతో ఇది వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news