ఇప్పటికీ చంద్రబాబు నా రాజకీయ గురువే – కాంగ్రెస్ నేత దివ్యవాణి

-

చంద్రబాబు నాయుడు మాకు ఎప్పుడు రాజకీయ గురువే అన్నారు కాంగ్రెస్ నాయకురాలు దివ్య వాణి. ప్రముఖ సినీ నటి, దివ్యవాణి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే దివ్యవాణికి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…చంద్రబాబు నాయుడు అంటే మాకు గౌరవం ఎప్పుడు ఉంటుంది.

కొన్ని తలా తోకలేని చానల్స్ నేను చంద్రబాబునాయుడుని దూషించినట్లు చూపించాయన్నారు. చంద్రబాబు నాయుడు అని మేము రాజకీయంగా ప్రేమించే వ్యక్తులము. పార్టీ లోపల ఉన్నటువంటి కొందరు వ్యక్తుల ప్రవర్తన వల్ల నేను తెలుగుదేశం పార్టీ విడవ వలసి వచ్చిందని చెప్పారు. పార్టీ వీడిన తర్వాత దాదాపు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలు నన్ను సంప్రదించాయి… నేను చాలా రోజులు ఆగి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడానికి నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.ప్రస్తుతానికి ఈ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెనర్ గా ఉంటున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news