నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం

-

తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ.. అధిష్టానం వ్యూహంతో ముందుకు వెళుతోంది.  స్థానిక నాయకులతో పాటు కాంగ్రెస్‌ అగ్రనాయకులు రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పదుల సంఖ్యలో రాష్ట్రానికి వరుస కడుతున్న పార్టీ నాయకులు 28వ తేదీ వరకు ఇక్కడే మకాం వేస్తారు. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లు మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు.

నిన్న రాష్ట్రానికి వచ్చిన ప్రియాంకా గాంధీ పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. వర్షం కారణంగా వాతావరణం అనుకూలించక షెడ్యూల్​లో నిర్ణయించిన అన్ని నియోజకవర్గాల్లో పర్యటించలేకపోయారు. ఇక ఇవాళ ప్రియాంక మరోసారి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఇవాళ పలు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించనున్నారు. ప్రచారం ముగియగానే  గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకుని దిల్లీకి తిరుగుపయనమవుతారు.

నేడు రాష్ట్రంలో ప్రియాంకా గాంధీ ప్రచారం నిర్వహించనున్న నియోజకవర్గాలు ఇవే.. 

నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారం

నేడు ఖమ్మం, పాలేరు, సత్తుపల్లిలో ప్రియాంక ప్రచారం

ప్రచారం అనంతరం ఖమ్మం నుంచి గన్నవరం వెళ్లనున్న ప్రియాంక

నేడు ఆంధోల్‌, సంగారెడ్డి, కామారెడ్డిలో రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం

Read more RELATED
Recommended to you

Latest news