ఇవాళ రాష్ట్రంలో నాలుగు నియోజకవర్గాల్లో అమిత్ షా ఎన్నికల ప్రచారం

-

తెలంగాణ అసెంబ్లీ సమరం తుదిఘట్టానికి చేరుకుంది. పోలింగ్ సమయం సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్, బీజేపీలు జాతీయ నేతలను రంగంలోకి దింపాయి. ముఖ్యంగా కాషాయ జాతీయ దళమంతా రాష్ట్రానికి పోటెత్తుతోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ఇవాళ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈరోజు మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం ఓ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు రేపు కూడా రాష్ట్రంలో అమిత్ షా ప్రచారం కొనసాగనుంది.

అమిత్ షా ఎన్నికల షెడ్యూల్ ఇదే.. 

నేడు కొల్లాపూర్‌, మునుగోడు, పటాన్‌చెరులో yీజేపీ విజయ సంకల్ప సభ

బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొననున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

సాయంత్రం ఖైరతాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రోడ్‌ షో

రేపు మక్తల్‌, ములుగు, భువనగిరి సభల్లో పాల్గొననున్న అమిత్‌షా

రేపు సాయంత్రం కూకట్‌పల్లి బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్‌షా

Read more RELATED
Recommended to you

Latest news