నేడు రాష్ట్రంలో మూడు నియోజకవర్గాల్లో ప్రియాంకా గాంధీ ప్రచారం

-

తెలంగాణ శాసన సభ ఎన్నికలకు రేపటితో ప్రచారానికి తెరపడుతుండడంతో కాంగ్రెస్‌ అగ్రనేతలు పర్యటనలు మరింత ఊపందుకున్నాయి.ఇవాళ ప్రియాంకగాంధీ మూడు నియోజకవర్గాలల్లో, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మూడు నియోజక వర్గాలల్లో ప్రచారం చేస్తారు. రేపు చివర రోజున హైదరాబాద్‌ నడిబొడ్డులో కాంగ్రెస్‌ అగ్రనేతలు భారీ జనసందోహం మధ్య రోడ్‌ షో నిర్వహించేందుకు కాంగ్రెస్‌ సమాయత్తం అవుతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్‌లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు.

కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇవాళ భువనగి, గద్వాల్, కొడంగల్‌ నియోజకవర్గాలల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక్కడ నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్‌ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రియాంక గాంధీ కొడంగల్ సభలో ప్రసంగిస్తారు. రేపు ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో…. హైదరాబాద్ నగరంలో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలతోపాటు ఏఐసీసీ నుంచి వచ్చిన దాదాపు ఉన్నత స్థాయి నాయకులు అంతా ఇందులో పాల్గొంటారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news