కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మారణ హోమాలే : సీఎం యోగి ఆదిత్యనాథ్

-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మారణ హోమాలు, బాంబ్ బ్లాస్టింగ్లు జరగడం ఖాయమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కర్మన్ ఘాట్ చౌరస్తాలో నిర్వహించిన సమావేశంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా యోగి ఆదిత్యనాథ్ పాల్గొని మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో హింసాత్మక సంఘటనలు జరిగాయని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ఆధ్వర్యంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగలేదని ఆయన పేర్కొన్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రపంచ దేశాలు గౌరవిస్తూ కొనియాడుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో బారాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కోట్ల రూపాయల ప్రజల సొమ్మును కాజేశాడని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో ల్యాండ్ మాఫియా పెరిగిపోయి కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందిందని, తెలంగాణ మాత్రం అభివృద్ధి చెందలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు. తెలంగాణలో పరీక్ష పత్రాలు లీకై ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ఎన్నికల్లో యువకులు తెలంగాణ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు. కార్పొరేట్ ఎన్నికల్లో నగరానికి వచ్చాయని, అప్పుడు బీజేపీ కార్పొరేటర్లు గెలిచి హైదరాబాద్లో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. నేడు మళ్ళీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో నగరానికి రావడం జరిగింది అని, హైదరాబాద్ నగరం అంటే మాకు ఎంతో ఇష్టం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news