BRS : గెలిచిన ఎమ్మెల్యేలతో ఇవాళ కేటీఆర్‌ సమావేశం

-

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం గెలిచిన ఎమ్మెల్యే లు,ముఖ్య నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ పై ఈ సందర్భంగా చర్చించనున్నారు కేటీఆర్‌. ఇది ఇలా ఉండగా.. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన రేవంత్ ను కలిసిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.

KTR

తాజాగా దీనిపై ఆయన స్పందించారు. ‘సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. అదంతా పచ్చి అబద్ధం. కేసీఆర్ నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చారు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను. కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తా. జై తెలంగాణ’ అని వెంకట్రావు స్పష్టం చేశారు. అటు మరికాసేపట్లో రాజ్ భవన్ కు సీఈఓ వికాస్ రాజ్ వెళ్లనున్నారు. గెలిచిన అభ్యర్థుల లిస్ట్ గవర్నర్ కు అందించనున్నారు సీఈఓ. CEO నివేదిక అందిన తరువాత కొత్త శాసనసభ ఏర్పాటుకు విడుదల కానుంది గెజిట్ నోటిఫికేషన్. నిన్న సాయంత్రం తన రాజీనామాను గవర్నర్ కు అందించారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news