దిల్లీ ఓటు మోదీకే అని ప్రజలు చెబుతున్నారు : కిషన్ రెడ్డి

-

ఐదు రాష్ట్రాల ఎన్నికలను ఇండియా కూటమి నేతలు సెమీ ఫైనల్ గా అభివర్ణించారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ మిత్రపక్షాల సవాల్‌ను ప్రజలు స్వీకరించి స్పందించారని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసిందని గుర్తు చేశారు. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్మారని పేర్కొన్నారు. అందుకే కుటుంబసభ్యుల జోక్యం లేని ప్రజాపాలనకు పట్టం కట్టారని వివరించారు.

హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించిన కిషన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల గురించి మాట్లాడారు. “పార్లమెంటు ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. దిల్లీ ఓటు మోదీకే అని అన్ని వర్గాల ప్రజలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీ హ్యాట్రిక్‌ సాధించబోతున్నారు. తెలంగాణలో బీజేపీకి మెజార్టీ స్థానాలు వస్తాయి. పార్లమెంటు ఎన్నికలపై జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నాం. ఇవాళ రంగారెడ్డి, రేపు హైదరాబాద్‌ పార్లమెంటు స్థానాలపై సమీక్ష చేస్తాం. మండల కమిటీల పటిష్టానికి జనవరిలో కార్యాచర్యణ ప్రణాళిక రూపొందిస్తున్నాం.” అని కిషన్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news