ప్రధాని మోడీపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

-

ప్రధాని నరేంద్ర మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. దేశంలో సంస్థాగత వ్యవస్థలను ప్రధాని మోదీ నాశనం చేస్తున్నారని ఆరోపించారు. సిపిఐ 99 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. మోడీ విధ్వంస పాలన అంతం చేసేందుకు ఇండియా కూటమి ఏర్పడిందన్నారు. తెలంగాణలో కూడా ఇండియా కూటమిని బలపరుస్తామని చెప్పుకొచ్చారు. బిజెపి మోస్ట్ క్రిమినల్ గవర్నమెంట్ అని వ్యాఖ్యానించారు.

మోడీ, అమిత్ షా క్రిమినల్స్ అని.. ఈ క్రిమినల్స్ గ్యాంగ్ దేశాన్ని పరిపాలిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ సంపదను అదానీ చేతికి అప్పచెబుతున్నారని మండిపడ్డారు నారాయణ. ప్రధాని మోడీ ఎన్నికల కమిషన్ తోపాటు విచారణ సంస్థలని తన పెంపుడు కుక్కల్లా తయారు చేశారని అన్నారు. ఇండియా పేరు చూసి మోడీ ప్రభుత్వం భయపడుతుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పార్లమెంటుపై దాడి జరిగిందని.. దాడి చేసిన వారికి బిజెపి ఎంపీ పాస్ లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news