నాలుగు నెలల తర్వాత నా అసలు రూపం చూపిస్తా – ఎమ్మెల్యే కేతిరెడ్డి

-

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 4 నెలల తర్వాత తన అసలు రూపం చూపిస్తానని అన్నారు కేతిరెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి ఏ పార్టీ వచ్చిన తన ప్రత్యర్థులను వదిలే ప్రసక్తే లేదని అన్నారు. పంటకు చీడ పురుగు ఎంత ప్రమాదమో.. రాజకీయాలలో ఉన్న చీడపురుగులు కూడా అంతే ప్రమాదమని.. వాటిని ఎరివేస్తానని అన్నారు. నా ఓర్పు, సహనాన్ని పరీక్షిస్తున్న వారికే ఈ వార్నింగ్ అన్నారు.

జెసి ఫ్యామిలీపై పరోక్షంగా కేతిరెడ్డి పెద్దరెడ్డి వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత మళ్లీ పాత పెద్దారెడ్డిని చూస్తారని.. మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల వైసిపి తాడిపత్రి అభ్యర్థిని తానేనని స్వయంగా ప్రకటించుకున్న కేతిరెడ్డి.. టిడిపి నుండి ఎవరు పోటీ చేస్తున్నారో జెసి ప్రభాకర్ రెడ్డి తేల్చుకోవాలని సవాల్ విసిరారు. టికెట్ల కేటాయింపు విషయంలో జగన్ దే తుది నిర్ణయం అని.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న దాన్ని శిరసావహిస్తానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news