డ్రగ్స్‌ ఆరోపణలపై స్పందించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్

-

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ తరచుగా డ్రగ్స్‌ తీసుకుంటారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన దీనిపై స్పందించారు. అనేక సార్లు పరీక్షలు చేయించుకున్నానని ఇప్పటి వరకూ తన శరీరంలో ఎలాంటి డ్రగ్స్‌ ఆనవాళ్లను గుర్తించ లేదని మస్క్ స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే..  ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరిగే పార్టీల్లో ఎలాన్‌ మస్క్ తరచుగా పాల్గొంటారన్న విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీల్లో మస్క్ నిషేధిత డ్రగ్స్‌ను తీసుకుంటున్నారని అమెరికాకు చెందిన వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌  కథనాన్ని ప్రచురించింది. అంతే కాకుండా ఈ విషయంపై టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని అందులో పేర్కొంది.

అయితే ఈ కథనాన్ని మస్క్‌ ఎక్స్‌ ఖాతాలో ట్యాగ్‌ చేస్తూ  గతంలో రోగన్‌తో ఒకసారి సేవించానని అంగీకరిస్తానని.. నాసా అభ్యర్థన మేరకు మూడేళ్లుగా తాను పరీక్షలు చేయించుకుంటున్నానని చెప్పారు. ఇప్పటి వరకు తన శరీరంలో డ్రగ్స్‌, మద్యానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు గుర్తించలేదని ఎక్స్ లో ఎలాన్ మస్క్ పోస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news