వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా ప్రకటన వాయిదా

-

వైసీపీ అభ్యర్థుల మూడో లిస్టు విడుదల వాయిదా పడింది. వైసీపీ ఇంఛార్జిల మార్పుల చేర్పులకు సంబంధించి మూడో జాబితా ప్రకటనను వైసీపీ అధిష్టానం వాయిదా వేసింది. మరికొన్ని స్థానాలపై స్పష్టత రాకపోవడంతో జాబితా విడుదలను రేపు లేదా ఎల్లుండి వైసీపీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

కాగా.. మూడో లిస్ట్ లో 14 స్థానాల్లో ముఖ్య మంత్రి జగన్ మార్పులు చేర్పులు చేశారని వార్తలు వచ్చాయి. మూడో జాబితాను ముఖ్యమంత్రి జగన్ ఫైనల్ చేసేశారని, కాసేపట్లో ఆ లిస్ట్ ను విడుదల చేస్తారని వార్తలు రాగా….చివరి నిమిషంలో జాబితా ప్రకటనను వాయిదా వేశారు.ఇప్పటివరకు జగన్ 38 స్థానాల్లో ఇంఛార్జిల మార్పులు చేశారు. మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేయగా రెండో విడతలో 27 స్థానాల్లో జగన్ మార్పులు చేశారు. అయితే మొదటి లిస్ట్ లో ఎక్కడా కూడా ఎంపీ స్థానాలు ప్రకటించలేదు. రెండో జాబితాలో మాత్రం 3 ఎంపీ స్థానాల్లో మార్పులు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news