ముంబైకి జక్కన్న.. ఎస్‌ఎస్‌ఎంబీ 29 క్రేజీ న్యూస్ ఆన్ ది వే..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో గా త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం గుంటూరుకారం. ఎస్‌ఎస్‌ఎంబీ 28గా వస్తోన్న ఈ సినిమా ని 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది . ఇదిలా ఉంటే మహేశ్‌ మరోవైపు ఎస్‌ఎస్‌ఎంబీ 29 తో బిజీ అయ్యేందుకు రెడీ కాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు షురూ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

 

కాగా తాజాగా మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్‌ఎస్‌ రాజమౌళి త్వరలోనే ముంబైలో పలువురు హిందీ యాక్టర్లను కలవబోతున్నాడని ఓ వార్త సినీ లవర్స్‌లో జోష్ నింపుతోంది. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లెవల్లో నిర్మించబోతున్న ఈ సినిమాలో వరల్డ్‌వైడ్‌గా ఉన్న స్టార్‌ యాక్టర్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ఎస్‌ఎస్‌ఎంబీ 29 షూట్‌ కోసం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్టు వేసే ప్లాన్‌లో ఉన్నారని వార్తలు వినిస్తున్నాయి. ఈ సెట్‌లోనే ఎక్కువభాగం షూటింగ్ జరుగనుందని తెలుస్తోంది .

Read more RELATED
Recommended to you

Latest news