రాజారెడ్డి ఎంగేజ్మెంట్..ఇవాళ హైదరాబాద్ కు సీఎం జగన్

-

 

త్వరలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తనయుడు రాజారెడ్డి వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షర్మిల కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. జనవరి 18న అంటే ఇవాళ హైదరాబాదులోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో జరగనున్న రాజారెడ్డి వివాహ నిశ్చితార్థం వేడుకకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం జరగనుంది.

CM Jagan to Hyderabad today

అయితే.. ఇవాళ రాజారెడ్డి ఎంగే జ్మెంట్ ఉన్న తరుణంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్‌. ఇవాళ సీఎం జగన్ హైదరాబాద్ కు రానున్నారు. ఈ సందర్భంగా మేనల్లుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ కు హాజరుకానున్నారు సీఎం జగన్.ఇవాళ సాయంత్రం 6.15 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌….రాత్రి ఏడున్నరకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 8 గంటలకు గండికోటలోని గోల్కొండ రిసార్ట్స్ కు చేరుకోనున్న సీఎం జగన్…సోదరి షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ వేడుకలో కుటుంబ సమేతంగా పాల్గొననున్నారు.
ఇక రాత్రి 10.10 నిమిషాలకు తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news