భీమిలిలో ఈ నెల 27న వైసీపీ ఎన్నికల శంఖారావ సభ

-

ఈ నెల 27న భీమిలి నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖరావం ఉంటుందని ప్రకటించారు వైవీ సుబ్బారెడ్డి. 3 లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని.. భీమిలి, ఆనందపురం మండలాల్లో పలు లేఅవుట్ల పరిశీలన జరుగుతోందని పేర్కొన్నారు. అదేరోజు పార్టీ కార్యకర్తలతో సీఎం జగన్ ప్రత్యేక సమావేశం ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

అటు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే నాతో రా ఏపీని, ఏపీ అభివృద్ధిని చూపిస్తా అంటూ సవాల్ చేశారు. షర్మిల కాదు.. ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్నిఇరకాటంలో పెట్టలేరని ఫైర్ అయ్యారు. పక్కరాష్ట్రం తెలంగాణ నుంచి వచ్చి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్లు ఎవరు ? అంటూ ఆగ్రహించారు వైవీ సుబ్బారెడ్డి.

రమ్మనండి ఛాలెంజ్ చేస్తున్నా..మాతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తామని ఛాలెంజ్ చేశారు. తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఏపీకి వచ్చి ఇలా మాట్లాడితే ఎలా ? అని షర్మిలపై ఆగ్రహించారు. వైస్సార్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీ లో ఎలా చేరుతారని షర్మిలపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news