రైతుబంధు పడలేదన్నవారిని చెప్పుతో కొట్టండి : మంత్రి కోమటిరెడ్డి

-

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివాదాస్పద వాక్యాలు చేశారు. ఇప్పటివరకు రైతుబంధు పడలేదని జగదీష్ రెడ్డి అడుగుతున్నారు? దానిపై స్పందించాలని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా…. దానిపై కోమటిరెడ్డి స్పందించారు. ‘అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి. అంత ధైర్యం లేకపోతే ప్రశ్నించండి’ అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇక అటు రేపో.. మాపో జగదీశ్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జగదీష్ రెడ్డి…చావు తప్పి కన్ను లొట్ట పోయి గెలిచాడని చురకలు అంటించారు. ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని అసమర్థ నాయకుడు….ముగ్గురిని హత్య చేసిన కేసులో నిందితుడు.. హంతకుడంటూ ఫైర్‌ అయ్యారు.

జగదీశ్ రెడ్డి గురించి మాట్లాడటం వెస్ట్…అతను 80 ఎకరాల ఫార్మ్ హౌస్ ఎలా కట్టాడని నిలదీశారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం.. చుట్టూ జగదీశ్ రెడ్డికి 150 ఎకరాల భూములు ఉన్నాయని ఆరోపణలు చేశారు. 200 యూనిట్ల కరెంట్..100 రోజుల్లో ఇస్తామని…హామీ నిలబెట్టుకుంటామని ప్రకటించారు.

https://www.youtube.com/watch?v=ogV1u_YznK4

Read more RELATED
Recommended to you

Latest news