హుద్ హుద్ తుఫాన్ కంటే…విశాఖలో జగన్ చేసిన విధ్వంసమే ఎక్కువ – వైసీపీ ఎంపీ

-

విశాఖపట్నంలో హుద్ హుద్ తుఫాన్ కంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసమే ఎన్నో రెట్లు ఎక్కువని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. విశాఖపట్నంకు జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన ఘోరమైన అన్యాయానికి గాను ఆయన పార్టీ తరఫున పోటీ చేసేందుకు అక్కడ అభ్యర్థులే దొరకడం లేదని, గతంలో విజయనగరం ఎంపీగా వ్యవహరించిన బొత్స ఝాన్సీ గారిని విశాఖకు తెచ్చుకున్నారని తెలిపారు.

Jagan successfully failed MP Raghurama Krishnam Raju's plan
raghurama on cm jagan birthday

ఇప్పటికీ ఇంకా ఎంతో మంది అభ్యర్థులను దిగుమతి చేసుకునే ప్రయత్నాలలో ఉన్నారని అన్నారు. విశాఖపట్నంలో జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసాన్ని చూసి పోటీ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదని, స్థానిక ఎంపీ కుటుంబానికే రక్షణ లేదని, ఆయన కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేసిన ఘటన చూశామని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో విశాఖపట్నం విలవిల, గజగజ లాడుతోందని, విశాఖ వాసులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ, జన జాగరణ సమితి పేరిట వైకాపా నేతల ఇండ్లకు పోస్టర్లను అతికించారని, జన జాగరణ సమితి పేరిట పోస్టర్లు అతికించిన వారిని ఇండ్లలో నుంచి బయటకు రానిస్తారని తాను భావించడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news