వైఎస్ షర్మిలను చంపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు – మాజీ మంత్రి అయ్యన్న

-

వైఎస్ షర్మిలను చంపించినా ఆశ్చర్యపోనక్కర్లేదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వివాదస్పద కామెంట్స్ చేశారు. నాకు రోజూ ఫోన్ లలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి…..చంపేస్తాము అంటున్నారని ఆరోపణలు చేశారు. కలెక్టర్ కు చెప్పి గన్ లైసెన్స్ కోరానని తెలిపారు. జగన్ కు తల్లి, చెల్లి, పెళ్ళాం అనే బేధం లేదని ఆగ్రహించారు. సొంత బాబాయినే చంపించేసాడు…షర్మిలా ను కూడా చంపించినా ఆశ్చర్య పొనక్కర్కేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.


నాకు అనుమానంగా ఉంది…షర్మిలకు భద్రత పెంచాలి అని డిమాండ్ చేస్తున్నానన్నారు. అందరి లానే నా కొడుకు కూడా టికెట్ కావాలని పార్టీకి లెటర్ పెట్టుకున్నాడని వెల్లడించారు. నా కొడుకు కు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. దేవుడు దయవల్ల టికెట్ వస్తె ప్రజలు ఆదరించాలని కోరారు. ముఖ్యమంత్రా.. లేక పగటి వేషగాడా..”సిద్ధం” అంటున్న జగన్మోహన్ రెడ్డి జైల్ కు పోవడానికి సిద్ధం అవుతున్నాడని ఎద్దేవా చేశారు. సభలో క్యాట్ వాక్ చేయడానికి శిలువ ఏర్పాటు చేశారు…జగన్ అర్జునుడు కాదు భస్మాసురుడని అంటూ నిప్పులు చెరిగారు అయ్యన్న.

Read more RELATED
Recommended to you

Latest news