‘యానిమల్‌ పార్క్‌’ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్ ఇదే

-

టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా యానిమల్. ఈ చిత్రంపై ఎన్ని విమర్శలు వచ్చినా అటు బాక్సాఫీస్ వద్ద ఇటు ఓటీటీలో ఈ మూవీ హల్చల్ సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘యానిమల్‌ పార్క్‌’ ఉంటుందని ఇప్పటికే సందీప్ ప్రకటించిన విషయం తెలిసిందే.

పార్ట్-2లో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయని సందీప్ రెడ్డి చెప్పారు. గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్ పంచడమే యానిమల్ పార్క్ లక్ష్యమని తెలిపారు. రణ్బీర్ పాత్ర మరింత వైలెంట్గా ఉంటుందని అన్నారు. అయితే పార్ట్-2కు సంబంధించి నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. 2025లో సీక్వెల్ మూవీ సెట్స్పైకి వెళ్లనుందని సమాచారం. ఈ ఫిబ్రవరిలో స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలు కానుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రభాస్‌ హీరోగా సందీప్‌ ఇప్పటికే ‘స్పిరిట్‌’ చిత్రాన్ని ఖరారు చే/గా ప్రస్తుతం దాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, రణ్‌బీర్‌ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో వచ్చే ఏడాదే ‘యానిమల్‌ పార్క్‌’ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news