మణికొండలో కారులో మృతదేహం కేసులో ట్విస్ట్‌ !

-

హైదరాబాద్‌ మణికొండ లోని ఓ కారులో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. తాజాగా మారుతి కారులో మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. ఈ తరుణంలోనే…డయల్‌ 100కు కాల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుంది నార్సింగ్ పోలీసులు & క్లూస్ టీమ్. ఇక కారులో మృతదేహం వెలికితీశారు పోలీసులు.

body found in a car

అనంతరం ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇది హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చనిపోయిన వ్యక్తి పేరు రమేష్‌ గా గుర్తించారు పోలీసులు. అతను ట్రావెల్‌ బిజినెస్‌ చేస్తాడని తెలిపారు పోలీసులు. గుండెపోటుతో మరణించాడని స్థానికులు అనుకుంటున్నారు. అటు రమేష్‌ ఎక్కడి నుంచి వచ్చాడు ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు నెంబరు ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. స్థానికంగా ఉన్న సిసి టీవీ ఫూటేజ్ ను పరిశీలీస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news