‘యానిమల్’పై రణ్ వీర్ రివ్యూను మర్చిపోలేను: సందీప్ రెడ్డి వంగ

-

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన తాజా చిత్రం యానిమల్. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా నటించింది.యానిమల్ సినిమాపై బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఇచ్చిన రివ్యూను మర్చిపోలేనని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సినిమాను చూసిన తర్వాత రణ్వీర్ నాకు ఫోన్ చేసి 40 నిమిషాలు మాట్లాడారు. ఆ తర్వాత సుదీర్ఘ మెసేజ్ పెట్టారు. అందులో సినిమాకు సంబంధించిన చాలా విషయాలు రాశారు అని పేర్కొన్నారు.. దాన్ని నాలుగుసార్లు చదువుకుని చాలా సంతోషించా’ అని చెప్పారు.

ఈ చిత్రం లో బాబి డియోల్, అనిల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.డిసెంబర్ ఒకటవ తేదీన విడుదలైన యానిమల్ చిత్రం 900 కోట్ల భారీ వసూళ్లను సాధించింది.యానిమల్ చిత్రం తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news