మరో పదేళ్లు నేనే సీఎం.. వాళ్లు ఎలా వస్తారో చూస్తా : సీఎం రేవంత్ రెడ్డి

-

ఎల్బీ స్టేడియంలో జరిగిన 15,750మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పారు. కేసీఆర్ ఎలా అధికారంలోకి వస్తారో తాను చూస్తానని.. ఇక్కడే ఉంటానని తెలిపారు. అసెంబ్లీ రాని వారికి అధికారం ఎందుకు అని ప్రశ్నించారు.

 

కుటుంబ సభ్యులు గెలవక పోతే వెంటనే పదవులు ఇచ్చిన కేసీఆర్…ఈ తెలంగాణ పిల్లలు నీకు ఎం అన్యాయం చేశారు? అని ప్రశ్నించారు. అసెంబ్లీ కి రావడానికి కేసీఆర్ కి ధైర్యం లేదు కానీ నల్గొండ పోయి మాట్లాడుతున్నారు అని ఫైర్ అయ్యారు. ఆడ్డ మీద కొట్లడటం కాదు.. చట్ట సభలోకి రావాలని కేసీఆర్ ను కోరారు. ఈ రోజు కేసిఆర్ మళ్ళీ నీటి మాట పట్టిండు.. ఎందుకంటే ఆయన దగ్గర మరో ఏ సెంటి మెంటు లేదని విమర్శించారు. మొన్న నల్గొండ సభకు పోతే ప్రజలు కోడిగుడ్లు, టమాటాలు పెట్టీ కొట్టారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news