నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న గులాబీ నేతలు

-

తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గులాబీ పార్టీకి చెందిన కీలక నేతలందరూ పార్టీ మారుతున్నారు. అధికారంలోకి కాంగ్రెస్ లోకి రావడంతో ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు. అలాగే మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… కాంగ్రెస్ టికెట్లు ఆశించి కూడా కొంతమంది బయటకు వెళ్తున్నారు.

BRS leaders who will join the Congress party today

ఈ నేపథ్యంలోనే ఇవాళ గులాబీ పార్టీ నుంచి మరో నలుగురు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, GHMC డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, GHMC డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news