బోల్తా పడిన ఆర్టీసీ బస్సు..!

-

ఉన్నట్టుండి డ్రైవర్ అస్వస్థకి గురయ్యారు. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కత్తిపూడి హైవే మీద చోటు చేసుకుంది. తెలంగాణకి చెందిన ఆర్టీసీ బస్సు విశాఖపట్నం నుండి భద్రాచలం వైపు వెళ్తోంది ఈ క్రమం లో బస్సు కత్తిపూడి హైవే కి రాగానే ఉన్నట్టుండి డ్రైవర్ కి బీపీ లెవెల్స్ పడిపోయాయి. బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరికీ స్వల్ప గాయాలయ్యాయి. అన్నవరం ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుని పరిశీలించారు గాయపడిన వారిని దగ్గరలోనే ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స ని అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news