పవన్ కళ్యాణ్ ను ఏపీ నుంచి తరిమి కొట్టాలి – హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్

-

పవన్ కళ్యాణ్ ను ఏపీ నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచారు హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్. జనసేన పీఏసీ సభ్యులు, హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ తాజాగా వైసీపీలో చేరారు. సీఎం వైస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చేగొండి సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడారు.

hari rama jogaiah

పవన్ కళ్యాణ్ ని నమ్మి గతంలో జనసేనలో చేరాను. పవన్ బడుగు, బలహీన వర్గాలకు దగ్గరగా ఉంటారనుకున్నాను. కానీ ఏ ఆశలతో వెళ్లానో ఆ ఆశలన్నీ నీరు గార్చారు.పైకి కనిపించే పవన్ వేరు, తెర వెనుక వేరు.. ఆరు సంవత్సరాలు పనిచేస్తే ఇప్పటికి అరగంట మాత్రమే నాతో మాట్లాడారు.

ఇక నుంచి జగన్ కోసం పనిచేస్తా… ఏమీ ఆశించకుండా వైసీపీలో పనిచేస్తానని పేర్కొన్నారు. అర్హత లేని వ్యక్తి పార్టీలో ఇన్నాళ్లూ పనిచేశానని… పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. స్వార్థం చూసుకునే ఏ ఒక్క నాయకుడికి (పవన్ కళ్యాణ్)ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్థానం లేదు… పవన్ కళ్యాణ్ నీ ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్.

Read more RELATED
Recommended to you

Latest news