రెండో సారి ప్రమాణ స్వీకారం చేసేది ఇక్కడే: జగన్

-

విశాఖ సదస్సులో కీలక కామెంట్స్ చేసారు జగన్. ఎన్ని అడ్డంకులు వచ్చిన విశాఖపట్నం నుండి పాలన చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మంగళవారం ఉదయం జగన్ విశాఖ సదస్సులో మాట్లాడారు ఎన్నికల్లో మళ్లీ గెలిచి వచ్చాక విశాఖ లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. విశాఖని ఎకనామికల్ గ్రోత్ ఇంజన్ గా మార్చి అభివృద్ధితో పరుగులు పెట్టిస్తామన్నారు.

విశాఖ అభివృద్ధికి అన్ని విధాల కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి అన్నారు అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదని, శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో చిన్న మధ్య తరగతి పరిశ్రమలలో 30 లక్షల ఉద్యోగాలు వచ్చేయన్నారు. స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని అన్నారు బెంగళూరు కంటే విశాఖలోనే సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news