అయ్యె బాబుమోహన్​! చివరికి ఆ పార్టీలోకి..

-

సినీ నటుడు బాబు మోహన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన వ్యక్తి. రాజకీయాల్లోనూ ఓ వెలుగు వెలిగారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా సైతం పనిచేశారు. ఇది ఒకప్పటి మాట. రోజుకో పార్టీ మారుతూ వస్తున్న బాబు మోహన్​.. చివరికి ఎంపీ టికెట్​ కోసం ప్రజా శాంతి పార్టీలో చేరడం రాజకీయ వర్గాలను విస్మయం కలిగిస్తోంది.

హాస్య నటుడిగా మంచి పేరు సంపాదించిన బాబు మోహన్​ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చారు. 1999లో ఆందోల్​ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కార్మిక మంత్రిగా సైతం పనిచేశారు. ఆ తర్వాత 2004లోనూ తిరిగి అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ఓటమిపాలైన బాబు మోహన్​ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో టీఆర్​ఎస్​లో చేరారు. 2014లో తిరిగి ఆందోల్​ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించడంలో 2019లో ఆందోల్​ టికెట్​ దక్కలేదు. ఆ కారణంతో బాబు మోహన్​ బీఆర్​ఎస్​కు గుడ్​బై చెప్పి బీజేపీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్​ నుంచి పోటీ చేసిన ఆయన కనీసం డిపాజిట్​ కూడా దక్కించుకోలేదు. అదీ కాకుండా మొదట పోటీ చేయనని, ఆ తర్వాత బరిలో నిలిచారు.

అయితే, వరంగల్​ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడం తన కలగా బాబు మోహన్​ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి అవకాశం కల్పించినా అడిగినా అధిష్టానం నుంచి ఎలాంటి హామీ రాలేదు. దీంతో ఇటీవల బీజేపీకి సైతం గుడ్​బై చెప్పారు.

ఇప్పటికే టీడీపీ, టీఆర్​ఎస్​, బీజేపీ పార్టీలను చుట్టి వచ్చిన బాబు మోహన్​.. ఎలాగైనా 2024 పార్లమెంట్​ ఎన్నికల్లో పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. అధికార కాంగ్రెస్​ నుంచి టికెట్​ వచ్చే ప్రసక్తి లేకపోవడంతో చివరికి కేఏ పాల్​ నేతృత్వంతలోని ప్రజా శాంతి పార్టీలో చేరిపోయారు. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో వరంగల్​ నుంచి బాబు మోహన్​ పోటీ చేయనున్నట్లు కేఏ పాల్​ సైతం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news