KCR, RSP లకు షాక్ ఇచ్చిన మాయవతి..!

-

తెలంగాణ పాలిటిక్స్ కి ప్రస్తుతం ఒక పార్టీ జాతీయ అధ్యక్షురాలు చేసిన ట్వీట్ షేక్ చేస్తుంది లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఉంటామని ప్రకటన చేసిన ఇద్దరు కీలక నేతలని పార్టీ కేడర్లని ట్వీట్ అయోమయంలోకి నెట్టేసింది. మాయావతి ఒక ట్వీట్ తో దేశవ్యాప్తంగా ఒంటరిగానే ఎంపీ ఎలక్షన్లో వెళుతున్నట్లు తేల్చి చెప్పారు పొత్తు లేదు అని ట్విట్టర్ ద్వారా ఆమె పోస్ట్ చేశారు.

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తో బిఎస్పి స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ కావడం పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని ఇరువురి నేతలు ప్రకటించిన విషయం మనకి తెలిసిందే. ఈ అంశంపై కేసీఆర్ స్వయంగా మాట్లాడారు ప్రవీణ్ కుమార్ తో ప్రస్తుతం మాట్లాడమని రేపు బిఎస్పీ అధినేత్రి మాయావతి తో మాట్లాడతామని ప్రకటించారు. కచ్చితంగా పార్టీ కలిసి పోటీ చేస్తామని సీట్ల పెంపకం పై త్వరలోనే ప్రకటన చేస్తామని కెసిఆర్ అన్నారు మాయావతి మాత్రం రాబోతున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news