సత్యం డైరెక్టర్ మృతి..!

-

సత్యం దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్ కంటెస్టెంట్ గా కూడా సూర్యకిరణ్ ప్రేక్షకులకి దగ్గరయ్యారు అయితే ఇప్పుడు ఆయన అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయినట్లు సమాచారం. ఆయన మృతి పట్ల టాలీవుడ్ టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నాడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తోంది. సూర్యకిరణ్ కి తమిళ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు ఉంది.

గత కొంతకాలం నుండి పచ్చకామెర్లతో బాధపడుతున్నారు. ఆయనకి సోమవారం గుండెపోటు వచ్చిందట. తెలుగులో సత్యం, ధన 51 , రాజు భాయ్ వంటి సినిమాలతో మంచి ఇమేజ్ ని తెచ్చుకున్నారు. తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన అరసి సినిమాకి దర్శకత్వం వహించారు. బాల నటుడిగా రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయి దర్శకుడిగా రెండు నంది అవార్డులు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news