వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేసాము: రేవంత్ రెడ్డి

-

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా మాట తప్పలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేసి చూపించామన్నారు ఈరోజు భద్రాచలం రాములవారి ఆశీర్వాదం తీసుకుని ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్కీమైన ఇందిరమ్మ ఇళ్ల ప్రభుత్వ పథకాన్ని మొదలు పెట్టాము అని అన్నారు.

బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరమే ఇందిరమ్మ ఇల్లు అని అన్నారు పేదల కష్టాలు చూసి ఆనాడు ఇందిరాగాంధీ ఈ పథకాన్ని ప్రారంభించారని అన్నారు ఇల్లాలి ముఖంలో ఆనందం ఉందంటే ఆ ఇల్లు బాగుందని అర్థం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇంటి నిర్వహణ మహిళ చేతిలో ఉంటే ఇల్లు బాగుంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద ఇస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news