Tirumala: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 08 గంటల సమయం

-

Tirumala: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 67, 832 మంది దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 25, 636 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు.

Time 08 hours for Tirumala Srivari Sarvadarshan

నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.55 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది టీటీడీ పాలక మండలి. ఈ నెల 18 నుంచి జూన్‌ నెల దర్శన టికెట్లు రిలీజ్‌ కానున్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news