నయనతారనా మజాకా.. 50 సెకండ్ల యాడ్‌కు అన్ని కోట్లా రెమ్యూనరేషనా…!

-

హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాది ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకున్న నయనతార అటు నార్త్ లోను మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అందుకే అటు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్ చేస్తూనే.. స్టార్‌ హీరోల చిత్రాలలో నటిస్తూ అందరిని అలరిస్తుంది.

లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయన్‌.. తమ సినిమాల్లో ఉంటే వసూళ్లు కూడా భారీగా నమోదవుతాయని నిర్మాతలకు నమ్మకం ఉంది. ఈ విశ్వాసంతో ప్రొడ్యూసర్స్ నయనతారకు ఎంత అడిగితే అంత ఇచ్చడానికి సిద్ధంగా ఉంటారు. అయితే నయనతారకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో విపరీతముగా వైరల్ అవుతుంది. 50 సెకండ్ల యాడ్‌ కోసం కూడా వాణిజ్య సంస్థల నుంచి నయనతార భారీగా పారితోషికం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.టాటా స్కైతో పాటు, స్లైస్‌ మామిడి రసం యాడ్స్‌లో నటించడానికి రూ.5 కోట్ల చొప్పున రెమ్యునరేషన్‌ తీసుకుందని తెలియడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.కేవలం 50 సెకండ్ల నిడివి ఉండే ఒక్కో యాడ్‌ కోసం రూ.5 కోట్లు తీసుకుందని తెలిసి అవాక్కవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news