తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

-

తిరుమల భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న ఒక్క రోజు 10 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 83,825 మంది దర్శించుకున్నారు.


అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 25,690 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4. 57 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది టీటీడీ పాలక మండలి. రేపటి నుంచి జూన్‌ నెల దర్శన టికెట్లు రిలీజ్‌ కానున్నాయి. నేటి నుంచి 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news