IPL 2024: MI ఫ్యాన్స్ దాడి.. CSK అభిమాని మృతి

-

IPL 2024: IPL 2024 చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్ అభిమానుల దాడిలో గాయపడిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని మృతి చెందారు. ఈ టోర్నమెంట్‌ నేపథ్యంలో మొన్న చెన్నైయ్‌ తో జరిగిన మ్యాచ్‌ లో రోహిత్ శర్మ ఫ్యాన్స్ కాస్త అతి చేశారు. ధోనీ అభిమాని తల పగలగొట్టారు రోహిత్ శర్మ ఫ్యాన్స్. ఈ సంఘటన మహారాష్ట్ర జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

MI fans kill CSK fan who celebrated Rohit Sharma’s dismissal

మహారాష్ట్ర కొల్హాపూర్‌లో SRH VS MI మ్యాచ్లో రోహిత్ శర్మ ఔట్ కావడంతో ధోనీ అభిమాని బండోపంత్ టిబిలే(63) “రోహిత్ ఔటైపోయాడు, ఇప్పుడు ముంబై ఎలా గెలుస్తుంది” అంటూ హేళన చేశాడు. దీంతో కోపంలో రోహిత్ ఫ్యాన్స్ బల్వంత్, సాగర్ టిబిలే తలపై కర్రతో కొట్టారు. అయితే.. ఆనాటి నుంచి టిబిలే పరిస్థితి విషమంగా ఉంది. ఈ తరుణంలోనే తాజాగా ధోనీ అభిమాని బండోపంత్ టిబిలే(63) మరణించారు. ఇక ఈ సంఘటనలో ఇప్పటికే నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news