నేడు తుక్కుగూడలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ

-

లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోంది. ఈ తరుణంలోనే ఇవాళ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా సమర శంఖం పూరించనుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు జన జాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది కాంగ్రెస్.

A huge open meeting of Congress in Tukkuguda today

నిన్న ఢిల్లీలో ప్రకటించిన మేనిఫెస్టోను రాహుల్ గాంధీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి తెలుగులో విడుదల చేస్తారు. ఇక ఈ సభకు 10 లక్షల మంది వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ సభ నేపథ్యంలోనే ఏకంగా 12 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కూడా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news