శ్రీవారి భక్తులకు అలర్ట్‌..తిరుమలలో ఇవాళ ఆ సేవలు రద్దు

-

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌..తిరుమలలో ఇవాళ ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం కార్యక్రమం ఉండనుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసింది టిటిడి పాలక మండలి.

TTD cancels earned services in Srivari temple

ఇక అటు తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న ఒక్క రోజే… 05 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. ఇక తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి నిన్న ఒక్క రోజే… 08 గంటల సమయం పట్టింది. నిన్న తిరుమల శ్రీవారిని 61920 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే.. తిరుమల శ్రీవారికి నిన్న ఒక్క రోజే… 17638 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు నిన్న ఒక్క రోజే… తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.55 కోట్లుగా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news