అయ్యో పాపం.. కూల్‌డ్రింక్‌ అనుకుని పెట్రోల్‌ తాగిన బాలుడు

-

ఏపీలోని నెల్లూరులో విషాదం చోటుచేసుకుంది. ఆలయం వద్ద ఆడుతూ కూల్‌ డ్రింక్‌ అనుకొని రెండేళ్ల బాలుడు పెట్రోల్‌ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఇరుగాళమ్మ కట్టకు చెందిన షేక్‌ కరిముల్లా, అమ్ము దంపతులకు కుమారుడు కాలేషా(2) అనే కుమారుడు ఉన్నాడు. ఈ నెల 7వ తేదీన సాయంత్రం అమ్ములు ఇరుగాళమ్మ ఆలయం వద్ద పని చేస్తుండగా.. కాలేషా అక్కడే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ పెట్రోల్‌ బాటిల్‌ను చూసి కూల్‌ డ్రింక్‌ అనుకొని తాగాడు. వెంటనే అపస్మారక స్థితికి చేరుకోవడంతో గమనించిన తల్లి.. బాలుడిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read more RELATED
Recommended to you

Latest news