మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలో మహిళల నిరసన

-

మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలో మహిళల నిరసన తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలో పది రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదని ఖాళీ బిందెలతో మహిళల నిరసనకు దిగారు. మంథని, భూపాలపల్లి కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామ ఎస్సీ కాలనీ మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో బైఠాయించారు.

Mission Bhagiratha water , Minister Sridhar Babu,

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామన్నారు.అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ట్యాంకర్లతో నైనా తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news