నాల్గవసారి మోడీ ప్రధాని: రాజ్ నాధ్ సింగ్

-

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కీలక కామెంట్లు చేశారు. బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్న తరుణం లో మోడీ మూడో సారి గెలుస్తారని నాలుగోసారి కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తారని ప్రజలు కోరుకునే వరకు ఆయన తన సేవని కొనసాగిస్తారని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడారు అంతర్జాతీయంగా భారత స్థాయిని ఎవరు పెంచుతున్నారో ప్రజలు చూస్తున్నారని దాన్ని మరింత పెంచాలని మోడీ చూస్తున్నారని, చేయగలరని అన్నారు. మోడీ పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు ప్రజలు మోడీతోనే ఉన్నారు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news