పరకాల కాంగ్రెస్‌లో విభేదాలు.. కొండా, రేవూరి వర్గాల మధ్య గొడవలు

-

పరకాల కాంగ్రెస్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు రచ్చకెక్కాయి. హనుమకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి శివారులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పరకాల ఎమ్మెల్యే, ఎన్నికల ఇన్‌ఛార్జి రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం ఈ రసాభాసకు వేదిక అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

తమకు తెలియకుండా ఇటీవల పలు మండలాలకు చెందిన వారిని పార్టీలో చేర్చుకోవడంపై కొండా వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. తాజాగా మంత్రి సురేఖ లేకుండానే సమావేశాన్ని నిర్వహించడంతో అలా ఎలా నిర్వహిస్తారని కొండా వర్గీయులు గొడవకు దిగారు. కొండా దంపతుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ కొండా వర్గానికి చెందిన వారు ఘర్షణకు దిగడంతో మంత్రి, ఎమ్మెల్యే వర్గాలకు చెందిన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు  ఇరు వర్గాల వారిని చెదరగొట్టి గొడవను సద్దుమణిగించారు.

Read more RELATED
Recommended to you

Latest news