పోసాని: వాళ్ళతో మాట కూడా చెప్పకుండా పార్టీని అమ్మేశాడు చిరంజీవి..!

-

పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి మీద ప్రముఖ సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి కీలక కామెంట్స్ చేశారు. పోసాని మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. వాలంటీర్లని మహిళలని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇదంతా ఆయన రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారన్నారు చంద్రబాబు లోకేష్ పై పవన్ విమర్శలు చేశారు.

మళ్లీ చంద్రబాబుని సీఎం చేయడానికి సిద్ధమయ్యారని చెప్పారు. కాపుల్లో ఎవరూ సీఎం గా పనికిరారు అని తేల్చేసి చంద్రబాబు గద్దె ఎక్కించడానికి పూనుకున్నారని అన్నారు. కాపుల ఆత్మగౌరవని చంద్రబాబు కాళ్ళ వద్ద తాకెట్టు పెట్టారని చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపు సామాజిక వర్గం అంతా నేతులందరూ ఆనందించారు. 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. సంతృప్తి పడకుండా కాపులకి ఒక్క మాట కూడా చెప్పకుండా పార్టీని కాంగ్రెస్ కి అమ్మేశారని అన్నారు ప్రజల కోసం జగన్ పార్టీ పెట్టారని మెగా ఫ్యామిలీ పైసల కోసం పార్టీలు పెట్టిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news