పోలింగ్ సమయం పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం

-

తెలంగాణలో పోలింగ్‌కు మరో 12 రోజుల సమయం మాత్రం ఉన్న వేళ కేంద్ర ఈజీ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా తెలంగాణలో పోలింగ్ సమయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషను పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ప్రకటించింది.

ఎండల తీవ్రత దృష్ట్యా రాజకీయ పార్టీల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. మే 13న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. కాగా, అంతకుముందు ఉ.7 గంటల నుంచి సా.5 వరకే సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని సా.6 గంటల వరకు పొడిగించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news