ఏకంగా తెలంగాణ అవాజ్ అయిన కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? : కేటీఆర్

-

తాజాగా బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఇక ఈ అంశంపై బీఆర్ఎస్ చీఫ్ కేటీఆర్ ఫైర్ అయ్యారు.’ఇదెక్కడి అరాచకం? ఏకంగా తెలంగాణ అవాజ్ అయిన కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? అని ప్రశ్నించారు.మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనల్లాగా అనిపించాయా? అని మండిపడ్డారు.బడే భాయ్.. చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా ఇది!’ అని ఎక్స్(ట్విట్టర్) లో ప్రశ్నించారు.

కాగా, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో కేసిఆర్ కాంగ్రెస్పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news