కూటమి మేనిఫెస్టోపై యనమల కీలక వ్యాఖ్యలు

-

సార్వత్రిక ఎన్నికలు సంపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ రెట్టింపవుతోంది. అధికార ప్రతిపక్షాలు మేనిఫెస్టోలు కూడా ప్రకటించిన క్రమంలో నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.సాధ్యమయ్యే హామీలే ఇస్తామంటూ వైసీపీ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకే నగదు పెంచి మేనిఫెస్టో రూపొందించగా, వైసీపీ కంటే ఎక్కువ జనాకర్షక పథకాలతో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రూపొందించింది.ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూటమి మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కూటమి మేనిఫెస్టో అందరికీ ఆమోదయోగ్యమైనదే అని, ఒక్క వైసీపీ తప్ప ప్రజలంతా మేనిఫెస్టోను మెచ్చుకుంటున్నారని తెలిపారు. ఈ మేనిఫెస్టో వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు.ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, ఈ వినాశనం నుండి రాష్ట్రాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకే ఆమోదయోగ్యంగా ఉందని తెలిపారు.ఇది పూర్తిగా అమలు చేయదగ్గ మేనిఫెస్టో అని, రాష్ట్రంలో అనవసర ఖర్చు తగ్గించుకుంటే 2వేల నుండి 3వేల కోట్ల వరకు ఆదాయం మిగులుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యవస్థలను గాడిలో పెట్టడం ద్వారా ఆదాయం పెరుగుతుందని ,ఎన్డీయే కూటమికి మద్దతిస్తుంది కాబట్టి కేంద్రం నుండి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news