ఏపీలో ఎన్డీయేదే అధికారం: ప్రధాని నరేంద్ర మోడీ

-

ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. అనకాపల్లిలో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ‘అనకాపల్లిలో బెల్లం, తెలుగు రెండూ మధురమైనవే. జూన్ 4న కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే జెండా రెపరెపలాడబోతుంది అని ఆశా భావం వ్యక్తం చేశారు.డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి మరింత ఎత్తుకు వెళ్తుంది. ప్రపంచంలోనే భారత్ గౌరవం పెరుగుతోంది’ అని అన్నారు.

ఈ ఎన్నికల్లో అధికార వైసీపీని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని తెలిపారు. ఈ వైసీపీ పాలనలో ఏపి రాష్ట్రాభివృద్ధి గతి తప్పిందని.. ఇంకా చెప్పాలంటే ఈ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనం బాట పట్టించిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానిదేనన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో మద్యనిషేధమని చెప్పి ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news