రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు

-

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌ తర్వాతే నిధులను రిలీజ్ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.రైతు భరోసా చెల్లింపుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్‌.వేణు కుమార్‌ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ .. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని పేర్కొంది.

5 ఎకరాలు పైబడి వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను సోమవారం రిలీజ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును దాదాపు రూ.2వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్టు సమాచారం.3 రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావించారు. కాని తాజా ఎన్నికల కమిషన్ ఆదేశాల నేపథ్యంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియకు బ్రేక్‌ పడింది.

Read more RELATED
Recommended to you

Latest news