నేటితో ముగియనున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర

-

మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర…నేటితో ముగియనుంది. అయితే ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇవాళ సిరిసిల్లలో పర్యటించనున్నట్లు జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య తెలిపారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారని వివరించారు.

నేటితో ముగియనున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర

అధిక సంఖ్యలో పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు.. సిరిసిల్ల ప్రజలు ఈ రోడ్ షో లో పాల్గొనాలని కోరారు. అనంతరం ఇవాళ సాయంత్రం సిద్దిపేటలో రోడ్ షోలో పాల్గొననున్న BRS అధినేత కేసీఆర్‌.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాగా గత నెల 24న కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని మే 1 న రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు ప్రచారంపై నిషేధం విధించింది ఈసీ.

Read more RELATED
Recommended to you

Latest news