ప్రధాని మోడీ నామినేషన్ … చంద్రబాబుకి ఆహ్వానం

-

ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేసే తేదీ ఫిక్స్ చేశారు. వారణాసి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మోడీ ఈ నెల 13వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్న విషయం తెలిసిందే.ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు.ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి మోదీ ఆహ్వానం అందింది.

చంద్రబాబు మంగళవారం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో వారణాసి వెళ్తారు. మోదీ నామినేషన్ సమర్పణ కార్యక్రమ అనంతరం ఎన్డీఏ పక్షాలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడతారు. అనంతరం అదే రోజు సాయంత్రం విజయవాడకు తిరిగి పయనంకానున్నారు.ప్రస్తుతం వారణాసి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మోడీ మరోసారి అక్కడి నుండి బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. ఇక, వారణాసిలో ప్రధాని మోడీపై యూపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజయ రాయ్ పోటీకి దిగుతున్నారు. వారణాసిలో పోలింగ్ జూన్ 1వ తేదీన చివరి దశలో జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news