ఛతీస్ గడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి

-

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. ఇంట్లో నుంచి బయటికీ వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చే వరకు డౌట్ గానే ఉంటుంది. ఎక్కడ రోడ్డు ప్రమాదం సంభవిస్తుందోనని కుటుంబ సభ్యులు సైతం భయబ్రాంతులకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా నిత్యం వందలాది మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోతున్నారు. వాహనదారులకు అతివేగం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించినప్పటికీ వాటిని లెక్క చేయకుండా అతివేగంతో వారు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలను బలిగొంటున్నారు.

తాజాగా ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కవార్తా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news