తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు గమనిక..హాల్‌ టికెట్లపై ప్రకటన

-

తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు గమనిక..హాల్‌ టికెట్లపై కీలక ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్ర గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు జూన్ 1 నుంచి అందుబాటులో ఉంటాయని TSPSC వెల్లడించింది. జూన్ 9న జరగనున్న ఈ పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

OMR పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉ.10:30 నుంచి మ.1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. కాగా, ఈ పరీక్షకు అభ్యర్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి అని అధికారులు పేర్కొన్నారు.
కాగా ఇవాళ టీఎస్ పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఈ పరీక్ష జరగనుంది. ఇప్పటికే అధికారులు 259 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.ఈ ప్రవేశ పరీక్షకు 92,808 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news